కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి 28 తె.3.07 కు తదుపరి సప్తమి 29 తె.4.02 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మూల ఉ.10.27 కు తదుపరి పూర్వాషాఢ 28 మ.12.13 కు
యోగం: సుకర్మ 28 తె.5:41 కు తదుపరి ధృతి 29 తె.5:14 కు
కరణం: కౌలవ మ. 2:27 కు తదుపరి తైతుల తె.3:07 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12:22-1:08 కు, మ. 2:40-3:26 కు
వర్జ్యం: ఉ.8.43-10.28 & రా.8.46-10.30 కు
అమృతకాలం: ఉ.6:26-8:12 కు
సూర్యోదయం: ఉ. 6:00 కు
సూర్యాస్తమయం: సా. 5:30 కు
🕉️ 1వ కార్తికసోమవారం , స్కందషష్ఠి 🕉️
గురుబోధ:
మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిథిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తిక మాసం లోనూ, మాఘ మాసం లోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial