కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 మార్చి 04 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గున మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి రా.8.13 కు తదుపరి షష్ఠి 5 రా.6.13 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: అశ్వని ఉ.9.00 కు తదుపరి భరణి 5 ఉ.6.58 కు
యోగం: ఐంద్ర రా.2.06 కు తదుపరి వైధృతి రా.11.07 కు
కరణం: బాలవ మ.3.17 కు తదుపరి కౌలవ రా.2.01 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 8.56 - 9.43 కు, రా. 11.13 కు - 12.02 కు
వర్జ్యం: సా.5.47-7.17 కు
అమృతకాలం: రా.10:12 - 11:40 కు
సూర్యోదయం: ఉ. 6:25 కు
సూర్యాస్తమయం: సా. 6:01 కు
గురుబోధ:
మంగళచండికా స్తోత్రం - యోగం లేక స్వగృహం విడిచిపెట్టి అద్దె ఇళ్ళలో ఉండేవారు 3 మంగళవారములు ఈ స్తోత్రమును దేవాలయంలో అమ్మవారి సన్నిధానంలో వీలైనన్నిసార్లు పారాయణం చేసుకొని, పుణ్యాత్ములకు యథాశక్తి దక్షిణ ఇస్తే వారి స్వగృహం వారికి తిరిగివస్తుంది. పోయిన ఇల్లు మళ్ళీ కొనుక్కునే శక్తి ప్రసాదిస్తుంది అమ్మ అనుగ్రహం. ఈ స్తోత్రాన్ని మనసు చెదరకుండా శ్రద్ధతో చదివినా, విన్నా సకల శుభములు కలుగుతాయి. అమంగళం జరుగదు. పుత్రసంతానం కలిగి తీరుతుంది.