Jan 31 2025జనవరి 31 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 జనవరి 31 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: విదియ సా.4.39 కు తదుపరి తదియ 1 మ.2.41 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: ధనిష్ఠ ఉ.8.08 కు తదుపరి శతభిషం 1 ఉ.7.08 కు
యోగం: వరీయాన్ మ.3.32 కు తదుపరి పరిఘ 1 మ.12.24 కు
కరణం: కౌలవ మ.1.59 కు తదుపరి తైతుల రా.12.49 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.9.07-9.52 కు & మ.12.52-1.36 కు
వర్జ్యం: మ.1.20-2.53 కు
అమృతకాలం: ఉ.8.16- 9.40 కు
సూర్యోదయం: ఉ. 6:38 కు
సూర్యాస్తమయం: సా. 5:48 కు

🕉️శ్యామలానవరాత్రులు 2వ రోజు🕉️

గురుబోధ:
మాఘమాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెపుతున్నాయి. మాఘ పూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలు. మాఘమాసం శుక్ల పక్షంలో పాడ్యమి మొదలుకుని చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణు స్వరూపం. మాఘమాసం లో కృష్ణ పక్షంలో వచ్చే పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉండే తిథులు 14 శివస్వరూపాలు. ఈ కాలంలో వీలున్నంత వరకు సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు. దత్తాత్రేయుడిని కనుక మనము స్మరణ చేస్తే ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. "దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం" అని మార్కండేయ పురాణములో ఒక శ్లోకం ఉన్నది. అలా దత్తాత్రేయుడిని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారు అవుతారు.

expand_less