Feb 21 2025ఫిబ్రవరి 21 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 21 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం

తిథి: అష్టమి ఉ.8.38 కు తదుపరి నవమి 22 ఉ.9.43
వారం: భృగువారం (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ మ.12.46 కు తదుపరి జ్యేష్ఠ 22 మ.2.30 కు
యోగం: వ్యాఘాత ఉ.11:58 కు తదుపరి హర్షణ 22 ఉ.11:55 కు
కరణం: కౌలవ ఉ.11:58 కు తదుపరి తైతుల రా.12.44 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 09.04 - 09.47 కు, మ. 12.52 కు - 01.38 కు
వర్జ్యం: సా.6.46-8.28 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

గురుబోధ:
బ్రహ్మ, విష్ణువుల ఇద్దరి మధ్య యుద్ధం ఆపడం కోసం మాఘమాసంలో లోకశ్రేయస్సు కోసం ఈశ్వరుడు ఒక అగ్నిస్తంభరూపం ధరించాడు. ఇది శివలింగం అని పిలువబడుతుంది. ఈ లింగమునకు రూపము ఉంది. రూపము లేదు. ఆకారము ఉంటుంది కాబట్టి లింగం ఇటు సగుణము, నిర్గుణము కూడా. శివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు మీ యుద్ధం ఆపడానికి లింగ రూపం ధరించాను, కనుక ఈ కాలమును లింగోద్భవకాలము అని అంటారు. ఈ లింగోద్భవకాలములో తనను అర్చించిన వాళ్ళు శాశ్వతంగా కైలాసములో నివసిస్తారు. వారికున్న ఈతి బాధలు తొలగిపోతాయి అని పరమశివుడు వరమిచ్చాడు.

expand_less