కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 17 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, కృష్ణ పక్షం
తిథి: పంచమి రా.2.39 తదుపరి షష్ఠి 19 తె.5.37
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: చిత్త తె.5.37 తదుపరి స్వాతి 18 పూర్తి
యోగం: శూల ఉ. 08.54 కు తదుపరి గండ 18 ఉ. 08.51 కు
కరణం: కౌలవ మ.3.34 కు తదుపరి తైతుల తె.5.37 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:53 - 01:38 కు, మ.03:10 - 03:56 కు
వర్జ్యం: మ.11.50 - 1.36 కు
అమృతకాలం: రా.12.22-2.10 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు
గురుబోధ:
మాఘ మాసం త్రిమూర్త్యాత్మకమని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘపూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలు. మాఘ శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణుస్వరూపమలు. మాఘ కృష్ణ పక్ష పాడ్యమి నుండి చతుర్దశి వరకు ఉండే 14 తిథులు శివస్వరూపాలు. ఈ కాలంలో వీలున్నంత వరకు సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వినియోగించాలి. దత్తాత్రేయుడిని కనుక మనము స్మరణ చేస్తే ఆయనలో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. "దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం" అని మార్కండేయ పురాణములో ఒక శ్లోకం ఉన్నది. అలా దత్తాత్రేయుడిని ధ్యానం చేసినా త్రిమూర్తులను పూజించిన వారు అవుతారు.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial