Feb 01 2025ఫిబ్రవరి 01 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఫిబ్రవరి 01 2025 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము శుక్ల పక్షం

తిథి: తదియ మ.2.41 కు తదుపరి చతుర్థి 2 మ.12.39
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: శతభిషం ఉ.7.08 కు తదుపరి పూర్వాభాద్ర 2 తె.5.53
యోగం: పరిఘ మ.12.24 కు తదుపరి శివ 2 ఉ. 8.14 కు
కరణం: గరజి ప. 11.38 కు తదుపరి వణిజ రా.10.26 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.8.21 - 9.06 కు
వర్జ్యం: మ.1.20 - 2.53 కు
అమృతకాలం: రా. 7.06 - 8.36 కు
సూర్యోదయం: ఉ. 6:31 కు
సూర్యాస్తమయం: సా. 5:51 కు

🕉️శ్యామలానవరాత్రులు 3వ రోజు🕉️

గురుబోధ:
🕉️ శ్యామలానవరాత్రులలో ఆకుపచ్చరంగులో ఉండేటటువంటి అమ్మవారి పటాన్ని కాని, విగ్రహం కాని పూజా మందిరంలో పెట్టుకుని 9 రోజులు అమ్మను పూజించి పాయసాన్ని నివేదన చేయండి. అలా చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. స్త్రీలకు, పురుషులకు అప్పటికే పెళ్ళి అయిన వారికి దాంపత్యంలో ఐకమత్యం పెరుగుతుంది. వార్థక్యంలో ఉన్న వారు వైధవ్యాలు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు. కుటుంబవృద్ధి, ధనధాన్యవృద్ధి అవుతుంది. అకాలమరణాలు ఉండవు. ఈ నవరాత్రులు అనేక శుభఫలితాలు ఇస్తాయి.

expand_less